కరోనా తెచ్చిన కష్టానికి ముంబాయి లో సెక్స్ వర్కర్ల బిజినెస్ పడిపోయిందట. దీంతో ఒకానొక టైంలో బయట వ్యాపారాలు అంతా జరుగుతున్న సమయంలో తమ బిజినెస్ బాగుండటంతో ఇప్పుడు అతి తక్కువ డబ్బులకు ఒళ్ళు అమ్ముకుని .. అన్నం తినాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ప్రభుత్వం నుండి వారికి ఎలాంటి సహాయం అందించడం లేదని సోషల్ యాక్టివిస్ట్ అశోక్ పండిత్ ట్విటర్లో ట్వీట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బంగారం సినిమా హీరోయిన్ మీరాచోప్రా యాక్టివిస్ట్ అశోక్ పండిత్ ట్వీట్ కి స్పందించింది.
ఆమె ఏమని స్పందించింది అంటే ”కమాతిపుర అనే సిరీస్ లోనే నటించే క్రమంలో సెక్స్ వర్కర్లతో మాట్లాడినప్పుడు వారి జీవన పోరాటం చూసి ఎంతగానో బాధపడ్డాను. వారు తమ కడుపు నింపుకోవడం కోసం ఒళ్ళు అమ్ముకోవడం అనేది అత్యంత బాధకరమైన విషయం” అని ఎమోషనల్ ట్వీట్ చేశారు. దీంతో ఆమె చేసిన ట్వీట్ కు కొంతమంది నెటిజన్లు వివిధ రీతులుగా స్పందించారు. మీరు ఎందుకు వారికి సాయం చేయకూడదు అన్న రీతిలో ప్రశ్నించారు. దానికి మీరా చోప్రా రకరకాలుగా చాలా ఘాటుగా రిప్లై ఇవ్వడం జరిగింది. ఇదే తరుణంలో ఈ దేశంలో మహిళకు సేఫ్టీ లేదు అని… మంత్రికి ఫిర్యాదు చేసిన ఎటువంటి స్పందన లేదు అన్నట్టు తనకి మరియు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా గొడవ గురించి లేవనెత్తి వైరల్ కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.