ఈ మధ్య కాలంలో మురళీశర్మ కు చాలా మంచి రోల్స్ పడుతున్నాయి. `ఎవరు`లో మురళీశర్మ చుట్టూనే చాలా విషయం జరుగుతుంది. `రణరంగం`లోనూ మెయిన్ విలన్ మురళీ శర్మ. తాజాగా తెరకెక్కుతున్న చాలా చిత్రాల్లోనూ ఆయన కీలక పాత్రలకు సంతకం చేశారు. తాజాగా ఆయన మరో భారీ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో `తలైవి` అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో కంగనారనౌత్ టైటిల్ పాత్రలో కనిపిస్తారు. జయలలిత జీవితంలో అత్యంత కీలక పాత్ర పోషించిన ఎంజీఆర్గా నటించడానికి అరవింద్ స్వామి ఓకే చెప్పారు. ఆమె పొలిటికల్ కెరీర్లో ముఖ్యమైన ప్రత్యర్థిగా కరుణానిధిగా నటించడానికి ఇప్పుడు మురళీశర్మను ఓకే చేసినట్టు తెలిసింది. యావన్మంది తమిళ ప్రజలు అమ్మగా భావించి, పిలుచుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జీవిత కథను విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ రూపంలో రాశారు. ఆమె జీవితంలోని ముఖ్యమైన అంశాలతో పాటు, ఆమె థాట్ ప్రాసెస్ను ముఖ్యంగా స్టడీ చేసి ఈ స్క్రిప్ట్ రాశారని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని దక్షిణాదిభాషలతో పాటు హిందీలోనూ విడుదల చేస్తున్ఆరు. విష్ణు ఇందూరి ఈ సినిమాకు నిర్మాత.
previous post
next post
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!