Mani Sharma: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరు మణి శర్మ. ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్, తమన్ హవా కొనసాగుతున్న గాని వాళ్లకి పోటీగానే మణి శర్మ రాణిస్తున్నారు. వీళ్ళిద్దరి కంటే ముందు టాలీవుడ్ మార్కెట్ తన గుప్పెట్లో పెట్టుకున్న మణి శర్మ..అనేక స్టార్ ఆల్బమ్స్ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా సినిమాలో బ్యాక్ గ్రౌండ్ విషయంలో మహేష్ శర్మ అందించే మ్యూజిక్ చాలా హైలెట్ అని చెప్పాలి. అప్పట్లో సినిమా హీరోలు బట్టి మాత్రమే కాక మణిశర్మ మ్యూజిక్ గురించి కూడా ప్రత్యేకంగా సినిమాకి వచ్చే వాళ్ళు ఉండేవాళ్ళు.
ముఖ్యంగా మెగా హీరోల సినిమాలకు మణిశర్మ అందించే పాటలు అప్పట్లో హైలెట్ అవటమే కాక అనేక సినిమాలని విజయతీరాలకు చేర్చడం జరిగింది. ఇదిలా ఉంటే 2019లో “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో లైన్ లో పడ్డా..ఈ మ్యూజిక్ డైరెక్టర్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” సినిమా కి సంగీతం అందిస్తున్నారు. దాదాపు 13 సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమా కి మణిశర్మ .. మ్యూజిక్ అందిస్తున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే మరోపక్క ఎన్టీఆర్ కెరీర్లో 30 వ సినిమా డైరెక్టర్ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా .. కొరటాల మణిశర్మ నీ ఫైనల్ చేసినట్లు సరికొత్త వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. ఆచార్య సినిమాకి అద్భుతమైన సంగీతం అందించిన ఈ క్రమంలో.. తన అభిరుచులకు తగిన రీతిలో మణిశర్మ బాణీలు ఇవ్వటంతో కొరటాల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.