KHUSHI: 2001వ సంవత్సరంలో ఎస్ జే సూర్య దర్శకత్వంలో వచ్చిన “ఖుషి” సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా పవన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో పవన్ మేనరిజం అప్పటి కుర్ర కారుని ఎంతగానో ఆకట్టుకున్నాయి. కరాటి ఫైట్ లతో.. స్టైలిష్ మేకవర్ తో పవన్ భారీ హీట్ అందుకోవటం జరిగింది. ఈ సినిమాలో పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. మణిశర్మ అందించిన మ్యూజిక్ సినిమాకి అతిపెద్ద హైలెట్. వరుస విజయాలతో ఉన్న పవన్… “ఖుషి”తో అతిపెద్ద విజయాన్ని అందుకున్నాడు. ఏకంగా చిరంజీవి స్థాయి హీరో అని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో “ఖుషి” అనేక సంచలన సృష్టించింది. అటువంటి ఈ సినిమా గురించి తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. విషయంలోకి వెళ్తే సినిమా స్టార్టింగ్ లో వచ్చే “ఏ మేరా జహ” సాంగ్ నీ జాతీయస్థాయిలో… తీసుకెళ్లే ప్రయత్నాలు పవన్ అప్పట్లో చేయడం జరిగింది అంట. ముఖ్యంగా హిందీలో సాంగ్ ప్రమోషన్ గట్టిగా చేయాలని పవన్ ప్లాన్ చేసినట్లు మణిశర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అందువల్లే ఈ పాటని హిందీలో రాయడం జరిగింది.
కానీ కొన్ని అన్నివార్యాల కారణాలవల్ల జాతీయ స్థాయి దాకా ఈ పాటని తీసుకెళ్లలేకపోయాం. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అని కొత్త విషయాన్ని తెలియజేశారు. పవన్ అప్పట్లో సినిమా రంగంలో వచ్చిన తొలి నానాల్లో దేశం గురించి ఏదో ఒక సాంగ్ తన సినిమాలో కావాలని పెట్టుకునే వాడు. ఆతరహాలోనే “ఖుషి” లో “ఏ మేరా జాహా” సాంగ్ స్పెషల్ గా పెట్టడం జరిగింది. అప్పటినుండి సమాజం కోసం ఏదో సేవ చేయాలనే తపన ఉన్న పవన్ ప్రస్తుతం రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తూ మరో పక్క ప్రజలకు తన పరిధిలో సాయాలు అందిస్తున్నారు. కాగా ప్రస్తుతం రాజకీయాలు చేస్తూనే మరోపక్క కృషి దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!