మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రస్తుతం వరుస పెట్టి అవకాశాలు అందుకుంటున్నారు. 2020కి మందు దాదాపు ఇండస్ట్రీలో దేవి శ్రీ ప్రసాద్ హవా ఉండేది. కానీ ఎప్పుడైతే “అలా వైకుంఠపురం లో” సినిమాకి తమన్ సంగీతం అందించడం జరిగిందో పాటలు సూపర్ డూపర్ హిట్ కావటంతో.. మనోడికి డిమాండ్ ఎక్కువైపోయింది. “అలా వైకుంఠపురం లో” పాటలు సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించాయి. ఈ సినిమా రాకముందు తమన్ అందించే మ్యూజిక్ చాలా రొటీన్ అన్నట్టు ఉండేది. కొట్టిన బిట్ అంతకుముందు సినిమాలలో కొట్టిన రీతిలో రిపీట్ అన్నట్టు బాణీలు ఉండేవి.
కానీ “అలా వైకుంఠపురంలో” సినిమా నుండి తన టీం మొత్తం మార్చడంతోపాటు కొత్తదనం మ్యూజిక్.. అందించడంతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గతంలో ఎన్నడూ లేని రీతిలో తమన్ ప్రెజెంట్ ఇస్తున్నారు. బాలకృష్ణ నటించిన “అఖండ”, పవన్ కళ్యాణ్ నటించిన “భీమ్లా నాయక్” రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ సినిమాలు విజయం సాధించడంలో తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది.
ఈ క్రమంలో తాజాగా తమ “అల వైకుంఠపురం లో” సినిమాకి జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ పరిణామంతో తమన్ దశతిరిగినట్టే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. 68వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్.. “అలా వైకుంఠపురం లో” సినిమాకి ఇచ్చిన సంగీతంకి అవార్డు లభించింది. ప్రస్తుతం తమన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు కీలక ప్రాజెక్టులకు సంగీతం అందిస్తున్నారు. దాదాపు ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాలకు అన్నిటికీ కూడా తమన్ యే మ్యూజిక్ డైరెక్టర్.
Big Boss Vasanthi: పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచిన వాసంతి.. ఆ పార్ట్ చూపిస్తూ ఎక్స్పోజింగ్..!