నటసింహం బాలకృష్ణ ‘పైసా వసూల్’తో తెలుగు తెరకు పరిచయమైన ముస్కాన్ సేథీ.. అవకాశాల పరంగా దూసుకుపోతోంది. ఇటీవల ‘రాగల 24 గంటల్లో’ మెరిసిన ఈ భామ తాజాగా మరో సినిమా ఛాన్స్ కొట్టేసింది. ‘బిగ్ బాస్ 2’ కంటెస్టెంట్ తనీశ్ హీరోగా నటిస్తున్న ‘మహా ప్రస్థానం’ సినిమాలో నటించనుందట. గ్యాంగ్స్టర్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో తనీశ్ సరసన నటిస్తుందట. జానీ అనే కొత్త డైరెక్ట్ ఈ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే లాంచ్ అయిన ఈ సినిమా.. ఆసక్తికర కథనంతో ప్రేక్షకులను అలరించనుందన్న టాక్ వినిపిస్తోంది. ‘ది జర్నీ ఆఫ్ యాన్ ఎమోషనల్ కిల్లర్’ అనే ట్యాగ్ లైన్తో మరింత ఆసక్తి రేపుతోంది.
previous post
next post