SVP:సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ.103 కోట్ల గ్రాస్ని సాధించింది. అయితే మొదటి రోజు ఈ సినిమా మీద విపరీతమైన నెగెటివ్ టాక్ వచ్చింది. డిజాస్టర్ అయిందంటూ హ్యాష్ ట్యాగ్ను ట్రెండ్ చేశారు. అయితే సినిమా మీద విపరీతమైన నెగెటివిటీని ప్రచారం చేసినా కూడా కలెక్షన్లు మాత్రం తగ్గలేదు. వీకెండ్లో మరింతగా పుంజుకుంది. ఇదే విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ చెప్పుకొచ్చింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
SVP: నెగిటివిటీ ప్రచారానికి మైత్రీ మేకర్స్ బ్రేక్..
సోషల్ మీడియాలో ‘బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట’ హ్యాష్ ట్యాగ్ తో జనాల దృష్టిని ఆకర్షించడంతో పాటు వెంటనే సినిమా విడుదల అయిన రోజే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు మరియు దర్శకుడు పరశురామ్ మీడియా ముందుకు వచ్చి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చారు. వీకెండ్లో బుకింగ్స్ జోరు చూడండి అంటూ నెగెటివ్ ట్రెండ్ చేసిన వారికి పరోక్షంగా చురకలు అంటించింది మైత్రీ మూవీస్. సర్కారు వారి పాట షోలు ఇంకా పడకముందే నెగెటివ్ ట్రెండ్స్లు, మీమ్స్, ట్రోల్స్ చేశారు.. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు బ్లాక్ బస్టర్ అనే స్థాయికి సినిమా వచ్చింది.. సినిమా మూడో రోజు ఫస్ట్, సెకండ్ షోలు కూడా హౌస్ ఫుల్ అవుతున్నాయి.. సూపర్ స్టార్ స్వాగ్ సీజన్ను ఎంజాయ్ చేయండి.. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ అని మైత్రీ ట్వీట్ వేసింది. సర్కారు వారి పాట సినిమాకు సోషల్ మీడియాలో మరియు ఇతర మీడియాల్లో నెగటివ్ ప్రచారం జరుగుతున్న సమయంలో అది హైలైట్ అవ్వకుండా మైత్రి మూవీ మేకర్స్ వారు చాలా ప్రయత్నాలు చేసి ఎక్కువగా నెగిటివిటీ ప్రచారం కాకుండా చూసింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఖర్చు చేసి పాజిటీవ్ పబ్లిసిటీ..!?
మైత్రి మూవీ మేకర్స్ వారు సర్కారు వారి పాట సినిమాను డిఫైన్ చేసుకున్న విధానం పై అందరు చర్చించుకుంటున్న సమయంలో మరి కొందరు మాత్రం ఆ విషయాన్ని బూతద్దంలో పెట్టి విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఒక స్టార్ హీరో సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన సమయంలో ఆ సినిమా డిజాస్టర్ అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం జరిగింది. సోషల్ మీడియాలో సర్కారు వారి పాట సినిమా కోసం నిర్మాతలు చాలా ఖర్చు చేసి మరీ పాజిటివ్ పబ్లిసిటీ చేయిస్తున్నారనే వాదన కూడా ఒకటి వినబడుతుంది. దీనికి మైత్రి మూవీస్ వారి నుండి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.