Nadhiya: త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన “అత్తారింటికి దారేది” సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ అత్తగా నటించిన నదియా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ సినిమాకి ముందే “మిర్చి”లో ప్రభాస్ తల్లిగా నటించి సినిమా ప్రేమికులను మెప్పించింది. అంతకుముందే నదియా… మలయాళంలో అదే విధంగా తమిళంలో సినిమా చేయడం జరిగింది. 1984లో మలయాళంలో మోహన్ లాల్ సినిమాలో చేసి సూపర్ డూపర్ హిట్ అందుకొని ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఫస్ట్ సినిమకే నదియా ఫిలింఫేర్ అవార్డు దక్కించుకుంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో తమిళంలో మరియు మలయాళంలో అనేక సినిమాల ఆఫర్ లు అందుకున్న నదియా అప్పట్లో స్టార్ హీరోయిన్ గా బిజీ కెరీర్ స్టార్ట్ చేయడం జరిగింది. అటువంటి నదియా తాను ఇంటర్ చదువుతున్న సమయంలోనే ప్రేమలో పడటం జరిగిందట. పూర్తి విషయంలోకి వెళితే ఇంటర్ లో తన ఇంటి ఎదురుగా ఉండే శిరీష్ తో పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో శిరీష్ ఉన్నత చదువులు చదవడం తో పాటు విదేశాల లో ఉద్యోగం సంపాదించడం తో.. అమెరికా లో మంచిగా స్థిరపడడం జరిగింది అంట. అయితే ఇండియాలో నదియా స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ ఉన్న శిరీష్ కోసం తన కెరియర్ పక్కన పెట్టి 1988లో పెళ్లి చేసుకోవడం జరిగిందంట.
అమెరికాలో శిరీష్ ఉన్న సమయంలో.. ఆ టైంలో ఫోన్ ఇంకా ఎటువంటి మాట్లాడే సౌకర్యం లేకపోయినా.. హీరోయిన్ గా కెరీర్ లో ఉన్న శిరీష్ తో ట్రూ లవ్ నిలబెట్టుకుని తర్వాత ఇంట్లో పెద్ద వాళ్లతో ఓపించడం జరిగిందట. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడి ఇద్దరు ఆడపిల్లలకు నదియా తల్లి అయిందట. తన కోసం సినిమాలు త్యాగం చేయడంతో కొన్ని సంవత్సరాల తర్వాత నదియాకి అవకాశాలు వస్తు ఉండటంతో భర్త శిరీష్… ఇంట్రెస్ట్ ఉంటే సినిమాలు చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. నదియా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం జరిగిందట. హీరో తల్లి పాత్రలో ఇంకా ప్రధాన పాత్రలు చేస్తూ … ప్రస్తుతం తెలుగు తమిళం, మలయాళం భాషల్లో కూడా నటిస్తూ ఉన్నారు.