Parusuram Naga Chaithanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో సర్కారు వారి పాట సినిమా అనేక రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ పరుశురాం ఈ సినిమా విజయంతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. మహేష్ బాబుతో సినిమా చేయక ముందు చాలా వరకు పరుశురాం ఇండస్ట్రీలో కుర్ర హీరోల తో ప్రాజెక్టులు చేయటం జరిగింది. విజయ్ దేవరకొండ తో గీతా గోవిందం ఇంకా మరి కొంతమంది కుర్ర హీరోలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ఇమేజ్ పరుశురాం క్రియేట్ చేసుకుని మహేష్ బాబు సినిమా ఛాన్స్ అందుకని ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా “సర్కారు వారి పాట” తో అవతరించాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సినిమా సూపర్ విజయం సాధించటంతో ఫుల్ జోష్ లో ఉన్న పరశురాం తన తర్వాత సినిమా అక్కినేని హీరో నాగచైతన్య తో ప్రకటించడం తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్ కి సంబంధించి పరుశురాం మదిలో… ఉన్న పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. మేటర్ లోకి వెళ్తే “నాగేశ్వరరావు” అనే టైటిల్ నాగ చైతన్య సినిమా కి పరశురామ్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. యాక్షన్ డ్రామా జోనర్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనున్నట్లు టాక్.
హీరోయిన్ ల ఈ విషయంలో పూజా హెగ్డే లేకపోతే రష్మిక మందన నీ తీసు కోవటానికి పరశురామ్ ఆలోచన చేస్తున్నట్లు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానున్న ట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ పెట్టిన తర్వాతే.. పరశురామ్ స్క్రిప్ట్ వర్క్ పనులు స్టార్ట్ చేయడం జరిగింది అని టాక్. కచ్చితంగా ఇది అక్కినేని అభిమానులను భారీగా ఎంటర్టైన్మెంట్ చేయడానికి… సినిమా విజయం సాధించడానికి కాలరెగరేసే రీతిలో.. ఉండబోయే సినిమా అని ఫిలిం నగర్లో వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా త్వరలో అనే సినిమాకి సంబంధించి టైటిల్ పోస్టర్ ముందుగా రిలీజ్ చేయాలని పరశురామ్ డిసైడ్ అయినట్లు కూడా టాక్.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!