Parasuram-Naga Chaitanya: 2008లో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా యువత సినిమాను తెరకెక్కించి దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన పరశురామ్ పెట్లా.. ఆ తర్వాత ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం చిత్రాలను రూపొందించారు. వీటిలో సోలో, శ్రీరస్తు శుభమస్తు ప్రేక్షకులను ఆకట్టుకోగో.. గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది.
ఈ మూవీతోనే మంచి ఫామ్లోకి వచ్చిన పరశురామ్.. ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి పనే చేసే అవకాశాన్ని అందుకున్నాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన తాజా చిత్రమే `సర్కారు వారి పాట`. మే 12న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టి మంచి విజయం సాధించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక ఈ మూవీ అనంతరం పరశురామ్ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో ఓ మూవీ చేయబోతున్నాడు. సర్కారు వారి పాట కంటే ముందే ఈ మూవీ పట్టాలెక్కాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్ పనులు జరుగుతున్నాయి.
అయితే 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకి `నాగేశ్వరరావు` అనే టైటిల్ బాగుంటుందని పరశురామ్ భావిస్తున్నారట. అందుకు చైతు కూడా గ్రీన్ సిగ్నెల్ ఇవ్వడంతో.. దాన్నే ఫైనల్ చేయాలని అనుకుంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. కాగా, ఈ మూవీలో చైతు మిడిల్ క్లాస్ ఎంప్లాయ్ గా కనిపించబోతున్నాడట. హీరోయిన్ మరియు మిగిలిన కాస్ట్ అండ్ క్రూ వివరాలు మరి కొద్ది రోజుల్లో బయటకు రానున్నాయి.