ఐరాక్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.3 గా తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ వైజాగ్లో జరుగుతుండగా హీరో నాగశౌర్య కాలికి గాయం అయిన విషయం తెలిసిందే.. డాక్టర్స్ సలహా మేరకు చిన్న సర్జరీ జరిగింది. ఇటీవల శౌర్య, తను నటించిన `ఓబేబీ` ఫంక్షన్కి హజరయ్యారు. యాక్సిడెంట్ అయిన తరువాత మెదటిసారిగా `ఓబేబీ` ఫంక్షన్కి మాత్రమే హాజరయ్యారు. కాలు జాయింట్ దగ్గర నరాలు చిట్లడంతో దాదాపు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. కానీ ఆర్టిస్టులు డేట్స్ సమస్య కాకూడదు అని భావించి షూటింగ్కి హజరయ్యారు. ఈరోజు నుండి హైదరాబాద్లోని మలక్పేట ప్రాంత్రంలో షూటింగ్ కార్యక్రమాలు మెదలు పెట్టారు. మెదటి షాట్ కూడా హీరో నాగశౌర్య మీదనే చిత్రీకరించారు. ఈ చిత్రంతో రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతుండగా మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్నారు.
previous post
next post