Nagababu:: సీనియర్ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అయితే నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న నాగబాబు.. నిర్మాతగా మాత్రం సక్సెస్ కాలేకపోయారు. పైగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఆస్తులలను సైతం ఎందుర్కొన్నారు.
ఈయన నిర్మాణంలో వచ్చిన సినిమాలేవి పెద్దగా విజయం సాధించలేదు. చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి వారు సైతం నాగబాబు నిర్మాణంలో నటించి బోల్లా పడ్డారు. దీంతో నాగబాబు నిర్మాతగా సినిమా అంటే అది ప్లాప్ అవుతుందనే బ్యాడ్ సెంటిమెంట్ బలంగా నాటుకుపోయింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ క్రమంలోనే చాలా కాలం నుంచీ నిర్మాణం వైపుకు పోని నాగబాబు.. మళ్లీ ఇప్పుడు నిర్మాతగా మారబోతున్నారు. ఇంతకీ ఈయన నిర్మించబోయేది ఎవరి సినిమానో కాదు.. ఆయన తనయుడు వరుణ్ తేజ్ది. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కబోతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ జులై నుంచీ సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బీ.వీ.ఎస్.ఎన్.ప్రసాద్ తో కలిసి నాగబాబు భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నారట. దీంతో ఇప్పుడీ విషయంపైనే వరుణ్ ఫ్యాన్స్ వర్రీ అయిపోతున్నారు. నిర్మాతగా బ్యాడ్ సెంటిమెంట్ ను మూటగట్టుకున్న నాగబాబు.. కొడుకు కెరీర్ను ఎందుకు రిస్క్లో పెడుతున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆయన రిస్క్ అని తెలిసి కూడా ముందుకు వెళ్తారా..? లేక.. వెనక్కి తగ్గుతారా..? అన్నది చూడాలి.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!