దేశంలో కరోనా వైరస్ వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలూ దెబ్బ తిన్నాయి. ఇందులో సినీ పరిశ్రమ కూడా ఉంది. ఎక్కడా షూటింగ్స్ లేవు.. సినిమా ప్రదర్శనలు లేవు.. మొత్తంగా ఎవరూ బయటకు వచ్చి సినిమాచూసూ పరిస్థితులు లేకపోయాయి. కరోనా తీవ్రత దేశంలో తగ్గకున్నా ఇప్పుడిప్పుడే వ్యవస్థలన్నీ గాడిలో పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్స్ కు పర్మిషన్స్ ఇచ్చాయి. అయితే.. పర్మిషన్ ఇచ్చిన తర్వాత దేశంలో కరోనాపరిస్థితులు మరింత పెరిగిపోయాయి. అయితే.. ప్రస్తుతం అత్యంత జాగ్రత్తలు తీసుకుని షూటింగ్స్ షురూ చేసే టైమ్ వచ్చింది. అయితే.. ఇంకా షూటింగ్స్ కు భయపడే పరిస్థితులే ఉన్నాయి.
బాలీవుడ్ లో అక్షయ్.. టాలీవుడ్ లో నాగార్జున..
దేశంలో అందరికంటే ముందుగా సినిమాలకు పర్మిషన్ ఇచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం. అయితే.. ఎవరూ షూటింగ్స్ కు వెళ్లలేదు. కారణం ఇప్పటికీ రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల్లో మహారాష్ట్రదే అగ్ర స్థానం. ఈ నేపథ్యంలో షూటింగ్స్ ప్రారంభం కాలేదు. ఇటివలే బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. యువ హీరోల నుంచీ ఖాన్ హీరోల వరకూ ఎవరూ చేయనిది అక్షయ్ చేశాడు. తెలుగులో ఇలా ముందుకొచ్చింది నాగార్జున. ఇటివలే బిగ్ బాస్ 4 సీజన్ షూటింగ్ కోసం మేకప్ వేసుకున్న నాగ్.. ఇప్పుడు తన సినిమా వైల్డ్ డాగ్ షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. టాలీవుడ్ ఇప్పట్లో షూటింగ్స్ ప్రారంభిస్తామని ఎవరూ సిద్ధమవుతున్న వార్తలు లేవు. కానీ.. ఈ సీనియర్ సూపర్ స్టార్ షూటింగ్ ప్రారంభించాడు.
కరోనా తీవ్రతే కారణం..
ఇటివలే వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించారు. వికారాబాద్ అడవుల్లో షూటింగ్ చేస్తూండగా టీమ్ లో ఒకరికి కరోనా సోకిందని.. షూటింగ్ వాయిదా పడిందని వార్తలు వచ్చాయి. దీనిపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ లేకున్నా ఇటువంటి భయాలు అందరిలో ఉండిపోయాయి. ఈ నేపథ్యంలోనే వ్యాక్షిన్ సిద్దమైతే షూటింగ్స్ ప్రారంభించాలని కొందరు ఆలోచిస్తున్నారు. మరి టాలీవుడ్ లో షూటింగ్స్ సందడెప్పుడు మొదలవుతుందో చూడాలి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!