2019 ఎలక్షన్ సమయంలో డైరెక్టర్ మహి వి రాఘవ దర్శకత్వంలో రూపొందిన యాత్ర సినిమా జగన్ పార్టీకి మంచి పొలిటికల్ మైలేజ్ తీసుకొచ్చింది అని చెప్పటం లో ఎటువంటి సందేహం లేదు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర ని ఆధారం చేసుకుని తీసిన ఈ సినిమా మా బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ కావడంతో పాటుగా ప్రజలను ప్రభావితం చేసింది. వైయస్సార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఇట్టే ఒరిగిపోయారు. దీంతో ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ చెయ్యాలనే ఆలోచనలో మహి వి రాఘవ ఉన్నట్లు వార్తలు ఇండస్ట్రీలో వినబడుతున్నాయి.
“యాత్ర 2” టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించాలని డైరెక్టర్ అనుకుంటున్నారట. కాగా ఈ సినిమా వైయస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ చుట్టూ స్టోరీ ఉండే లా ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తోంది. అంతేకాకుండా సినిమాలో వైయస్ రాజశేఖర రెడ్డి పాత్రలో నాగార్జున నటించనున్నారని…. ఇక జగన్ పాత్రలో ఒక కుర్ర హీరో చేత నటింపజేయడానికి డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే నాగార్జునకి మొదటినుంచి అభిమానంతో పాటు జగన్ మంచి ఫ్రెండ్ కావటంతో ఈ సినిమానీ ఓకే చేసినట్లు సమాచారం. అంతా కుదిరితే జగన్ పాత్ర కూడా నాగార్జునే చేయాలని అనుకుంటున్నాడట. డ్యూయెల్ రోల్ లో నాగార్జున ఈ సినిమా చేయాలని అనుకుంటున్నట్లు, దీంతో డైరెక్టర్ కూడా దానికి సముఖంగా ఓకే చెబితే… త్వరలోనే జగన్ ఫ్యాన్స్ కి నాగార్జున పండగలాంటి వార్త చెప్పడం గ్యారెంటీ అని చాలామంది అంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?