Trivikram Ntr : టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు.ప్రస్తుతం ఈ హీరో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో త్రిబుల్ ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తొందరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని అక్టోబర్ 13న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా ఏం చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయం గురించి ఎలాంటి స్పష్టత రాలేదు.
తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నాగార్జున హీరోయిన్ నటిస్తున్నారని వినబడుతోంది. నాగార్జున నటించిన మన్మధుడు సినిమాలో అను పాత్ర ద్వారా పరిచయమైన అన్షు అంబానీ తర్వాత కొన్ని సినిమాలలో కొన్ని పాత్రల్లో కనిపించి కనుమరుగైపోయారు. అయితే చాలా కాలం తర్వాత ఈమె తిరిగి సినిమాలలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ సినిమాలో ఈమెను తీసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఇక మన టాలీవుడ్ హీరోయిన్లు ఈ హీరోయిన్ ముందు ఏమాత్రం సరిపోరని చెప్పవచ్చు.
ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా పాన్ ఇండియా రూపంలో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఒకప్పటి హీరోయిన్ ని సంప్రదించినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందనే విషయం గురించి చిత్రబృందం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా ఈ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్న ఈ బ్యూటీకి ఇది ఒక మంచి కంబ్యాక్ వచ్చినట్లు చెప్పవచ్చు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న మలయాళ హిట్ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే డైలాగులను అందించనున్నాడు. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ మధ్య అనుబంధం ఎలాంటిదో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈసారి పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో కాకుండా స్క్రీన్ ప్లే డైలాగులను త్రివిక్రమ్ అందించనున్నట్లు తెలుస్తోంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!