మన్మథుడు – 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడటంతో.. కాస్త డీలాపడినట్టు కనపడిన నాగార్జున.. తన తదుపరి సినిమాపై క్లారిటీకి వచ్చారట. ఇప్పటి వరకు ‘బంగార్రాజు’ సినిమాపై తర్జనభర్జనలు పడ్డ నాగ్.. దాన్ని పక్కన పెట్టి మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కొత్త దర్శకుడు సోలమన్ డైరెక్షన్లో ఓ సిన్మాను చేయడానికి రెడీ అయ్యారు. త్వరలో షూటింగ్ కూడా ప్రారంభిస్తున్నట్టు సమాచారం.
‘సోగ్గాడే చిన్ని నాయన’కి సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో తన నటవారసుడు నాగచైతన్యతో కలిసి నటించబోతున్నారు. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని మొదట భావించారు. దీనికోసం డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారట. ‘మన్మథుడు 2’ రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందని అందరూ ఊహించారు. కానీ చైతన్య డేట్లు కుదరకపోవడంతో అది ఆలస్యమవుతూ వచ్చింది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్లో చైతన్య ఓ సినిమా చేస్తున్నారు. అలాగే దర్శకుడు పరశురామ్తో కూడా ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. ఇవన్నీ పూర్తి కావాలంటే వచ్చే జూన్ వరకు టైమ్ పడుతుంది. దీంతో బంగార్రాజును 2021 సంక్రాంతికి టార్గెట్గా పెట్టుకున్నారట. చైతన్య డేట్లు వచ్చాక సినిమా చేయనున్నారట.