ఆరు పదుల వయసున్న నాగార్జున కుర్ర హీరోయిన్స్తో జోడి కట్టడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. ప్రస్తుతం ఈయన నటిస్తోన్న `మన్మథుడు 2`లో రకుల్ ప్రీత్ సింగ్, కీర్తిసురేశ్ సరసన నటించాడు. కాగా తదుపరి కూడా నాగార్జున సీక్వెల్ చిత్రం `బంగార్రాజు`లోనే నటించనున్న సంగతి తెలిసిందే. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందబోయే ఈ చిత్రంలో నాగార్జున, చైతన్య తాతా మనవడిగా నటిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో నాగార్జున జోడిగా పూజా హెగ్డే నటిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. అలాగే చైతన్యతో కీర్తిసురేశ్ నటిస్తుందని అంటున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. ఏదేమైనా సీనియర్ హీరోలైన చిరు, బాలయ్య, వెంకటేశ్ హీరోయిన్స్ సమస్యతో బాధపడుతుంటే, నాగార్జున మాత్రం కుర్ర హీరోయిన్స్తో జత కట్టేస్తున్నారు.
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!