నాగార్జున కొత్త సినిమా ‘ఘోస్ట్’ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో నాగార్జున చురుగ్గా పాల్గొంటున్నారు. ‘ఘోస్ట్’ లో ఇంటర్ పోల్ అధికారిగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాల జడ్జిమెంట్ విషయంలో అందరూ విఫలమవుతారు. ప్రేక్షకులకు ఏ సినిమా నచ్చుతుందో ఎవరు చెప్పలేరు. ఒకవేళ అదే తెలిస్తే ఇండస్ట్రీలో వాళ్లే నెంబర్ వన్. డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో “శివ” చేశాను సూపర్ డూపర్ హిట్ అయింది. మళ్లీ ఆయన దర్శకత్వంలో ఆఫీసర్ చేస్తే అట్టర్ ఫ్లాప్ అయింది.
ఇక “నిన్నే పెళ్ళాడుతా” వంటి రొమాంటిక్ మూవీ ఇచ్చిన కృష్ణవంశీ దర్శకత్వంలో.. “చంద్రలేఖ” చేస్తే జనాలు ఇంటికి పంపించేశారు. అప్పుడే రాఘవేందర్రావు దర్శకత్వంలో అన్నమయ్య స్టోరీ విన్నాను. అసలు ఆ సినిమా చేయకూడదని భావించాను. అంతకుముందే “నిన్నే పెళ్ళాడతా”లో హీరోయిన్ తో మంచి రొమాంటిక్ సాంగ్లు చేసుకుంటూ ఉంటే ఇప్పుడు భక్తి సినిమాలో నన్ను చూడగలరా అంటూ రాఘవేంద్రరావునీ ప్రశ్నించాను. ఆయన ఒకటే అన్నారు నన్ను నమ్ము. దీంతో బలవంతంగా నా కెరియర్లో అన్నమయ్య సినిమా చేశాను.
కానీ అది నా కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాగా నిలిచిపోయింది. వినోదం విషయంలో ప్రేక్షకుల నాడి తెలుసుకుంటే వాళ్లే నెంబర్ వన్. ఈ విషయానికి సంబంధించి రాజమౌళితో డిస్కషన్ చేస్తే… ముందు కథ నమ్మాలి అప్పుడు అదే ప్రేక్షకులకు నచ్చే రీతిలో తీయగల నమ్మకం ఉంటుంది అని రాజమౌళి చెప్పినట్లు నాగార్జున ‘ఘోస్ట్’ ప్రమోషన్ కార్యక్రమాలలో తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. ఆడియెన్స్ కి ఏం నచ్చుతుందో ఎవరు చెప్పలేరు అని నాగ్ పేర్కొన్నారు.