నగరంలో ప్రబలుతున్న డెంగ్యూ, వైరల్ ఫీవర్స్కు కారణమవుతున్న దోమల నుండి రక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ తెలంగాణ పురపాలక శాఖామంత్రి కేటీఆర్ ఇటీవల తెలియజేసిన సంగతి తెలిసిందే. దీనిపై మన హీరోలు ప్రభాస్, మహేశ్ మద్దతుగా ట్వీట్స్ పెట్టారు. ఇప్పుడు నాగార్జున అక్కినేని కూడా తన ఇంటి పరిసరాలు, అన్నపూర్ణ స్టూడియో పరిసరాల్లోని మురికి నీటిని శుభ్రం చేయించినట్లు తెలిపారు. మురికి నీరు వల్ల దోమలు వ్యాప్తి చెందుతాయని, వాటి వల్ల అనారోగ్యానికి గురవుతామని జాగ్రత్తగా ఉండాలని నాగ్ తెలిపారు. ఈ సందర్భంగా తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని, ఇప్పుడు కోలుకుందని తెలిపారాయన. దీంతో పాటు కొన్ని ఫొటోలను పోస్ట్ చేశారు నాగ్.
previous post
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!