ఆదరణ పొందుతున్న తెలుగు రియాలిటీ షోస్లో బిగ్బాస్ ఒకటి. మూడో సీజన్ ఈ నెల 21న ప్రారంభం కానుంది. తొలి సీజన్కు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తే.. రెండో సీజన్కు నాని వ్యాఖ్యాతగా పనిచేశారు. ఇప్పుడు మూడో సీజన్. అక్కినేని నాగార్జున ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించబోతుండటం విశేషం. అయితే ఈ షోపై ఆరోపణలు కూడా ఈసారి ఎక్కువగానే ఉన్నాయి. శ్వేతారెడ్డి, గాయత్రీ గుప్తా వంటి వారు షోపై నెగటివ్ కామెంట్స్ చేయడం.. కేసులు పెట్టడంతో పాటు.. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వచ్చాయి. తెలంగా విద్యార్థి జేఏసీ బిగ్బాస్ను ఆపాలంటూ మానవ హక్కుల కమీషన్కు ఫిర్యాదు కూడా చేసింది. ఇన్ని ఇబ్బందుల మధ్య షోను ఎందుకు ప్రారంభించాలి? ఇంత నెగివిటీ ఉంటే షో సక్సెస్ కాదేమోనని అక్కినేని నాగార్జున భావించి.. షోను కొన్నిరోజుల పాటు వాయిదా వేయాలంటూ నిర్వాహకులను కోరారని వార్తలు వినపడుతున్నాయి.
previous post
next post