Big Boss Telugu 5 : బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మొదటి నాలుగు సీజన్లు మంచి రేటింగ్స్ తో పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తాజాగా సీజన్ ఫోర్ ని కూడా పూర్తి చేసుకుంది. సీజన్ ఫోర్ పూర్తి అవ్వగానే వెంటనే బిగ్ బాస్ నిర్వాహకులు సీజన్ ఫైవ్ నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ షోలో పాల్గొనడానికి కంటెస్టెంట్ ల ఎంపిక విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులు నిమగ్నమయ్యారు.
ఏప్రిల్లో ప్రారంభం కానున్న బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొని అవకాశం జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది, యూట్యూబ్ స్టార్ట్ దుర్గారావు, షణ్ముఖ జస్వంత్, యాంకర్ రవి పాల్గొనబోతున్నారనే సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్ లను ఎంపిక చేస్తున్న బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి హోస్ట్ గా అక్కినేని నాగార్జున వ్యవహరిస్తారని ఇదివరకు వార్తలు వినిపించాయి. అయితే ఈ సీజన్ నుంచి నాగార్జున తప్పుకున్నట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ నుంచి నాగార్జున ఔట్ ఆ యువ హీరో కే అవకాశం:
బిగ్ బాస్ సీజన్ 3, సీజన్ 4 లకు హీరో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. అయితే బిగ్ బాస్ ఫైవ్ ఏప్రిల్లోనే ప్రసారం కావడంతో నాగార్జున ఒప్పుకున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంవల్ల ఈ రియాలిటీ షో కు యాంకర్ గా వ్యవహరించడానికి కుదరడంలేదు. దీంతో స్వయంగా నాగార్జునే ఈ రియాలిటీ షో నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా, మనం సీక్వెల్ సినిమా చేయబోతున్నారు. అందువల్ల ఈ రియాలిటీ షోకు హోస్ట్ గా వ్యవహరించడానికి దూరమయ్యారు. అయితే సీజన్ ఫైవ్ హోస్ట్ గా ఇదివరకే సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరించిన నాచురల్ స్టార్ నాని సీజన్ ఫైవ్ కి హోస్ట్ గా వ్యవహరిస్తారని సమాచారం వెలువడుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు నానినీ సంప్రదించినట్లు నాని కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి బిగ్ బాస్ నిర్వాహకులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!