ప్రస్తుతం మన దర్శక నిర్మాతలు పాటల్లోని పదాలను టైటిల్స్గా పెడుతున్న సంగతి తెలిసిందే. అలాగే కొన్ని క్లాసిక్ చిత్రాల టైటిల్స్ను కూడా ఇప్పటి చిత్రాలకు టైటిల్స్గా వాడుకుంటున్నారు. అలాంటి ఓ క్లాసిక్ సినిమా `మూగమనుసులు` టైటిల్ను ఇప్పుడు ఉపయోగించుకోబోతున్నారట. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున నంటిచిన ఈ సినిమా క్లాసిక్ చిత్రంగా నిలిచిపోయింది. ఆ సినిమా టైటిల్ను ఇప్పుడు నాగశౌర్య సినిమాకు ఉపయోగించుకోబోతున్నారట. నాగశౌర్య, లక్ష్మీ సౌజన్య కాంబినేషన్లోఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు `మూగమనసులు 2020` అనే టైటిల్ను పెట్టాలనుకుంటున్నారని సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సినిమా తెరకెక్కనుంది. అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమై వచ్చే ఏడాది మే నెలలో సినిమా విడుదల కానుంది.
previous post
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!