Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ డామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓపెనింగ్ కలెక్షన్స్ రికార్డు స్థాయి రాబట్టడంలో ఎప్పుడు ముందుంటాడు. మహేష్ సినిమా హిట్ అయింది అంటే… ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద లెక్కలు తారుమారు అయిపోతాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది మహేష్ బాబుకి తీరని లోటని చెప్పవచ్చు. అన్నయ్య, అమ్మ, తండ్రి ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. ఎంతో దగ్గరగా ఉండే వీళ్లు చనిపోవడం… మహేష్ నీ కృంగదీసినట్లయింది.
ఈ క్రమంలో మహేష్ నీ భార్య నమృత ఎంతగానో ఓదార్చడం జరిగింది. ఇటీవలే తన మామ సూపర్ స్టార్ కృష్ణ కోరిక మేరకు హోటల్ బిజినెస్ కూడా మహేష్ ఫ్యామిలీ స్టార్ట్ చేశారు. ఈ వ్యవహారాలన్నీ నమ్రత దగ్గరుండి చూసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. మహేష్ నీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న రోజు తన జీవితంలో మర్చిపోలేనని పేర్కొంది. ఇంకా మహేష్ బాబుకి తనకి మధ్య పిల్లల విషయంలో గొడవలు అవుతాయని స్పష్టం చేసింది. పిల్లలు ఏది కావాలన్నా తనని అడగకుండా మహేష్ దగ్గరికి వెళ్లి.. అడుగుతారు.
ఆయనేమో కాదు అనరు. కొన్నిసార్లు నేను కాదు అని చెప్పాల్సి ఉంటుంది. ఈ సందర్భాలలో నాకు ఆయనకు మధ్య వాదనలు జరుగుతాయి అంటూ.. నమ్రత ఇంటర్వ్యూలో తెలిపింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తారీకు ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ మధ్యలో సూపర్ స్టార్ కృష్ణ మరణించడం అంతకుముందు తల్లి ఇందిరాదేవి మరణించడంతోపాటు హీరోయిన్ పూజ హెగ్డే కాలుఫ్రాక్సర్ కావడంతో షూటింగ్ ఆలస్యమైంది. మరి అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా ఉంది. ఈ సినిమా అయినా వెంటనే మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ స్టార్ట్ కానుంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో.. రాజమౌళి.. మహేష్ కోసం ఒక సరికొత్త స్టోరీ రెడీ చేస్తున్నట్లు సమాచారం.