SSMB 28: బ్రేకుల్లేని హిట్స్తో కెరీర్ పరంగా జెట్ స్పూడ్లో దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇటీవల `సర్కారు వారి పాట`తో ప్రేక్షకులను పలకరించి మరో హిట్ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అనంతరం మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఓ కొత్త ప్రాజెక్ట్ను పట్టాలెక్కించబోతున్నాడు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించబోతోంది. అలాగే శ్రీలీల సెకెండ్ హీరోయిన్గా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్ పనులు జరుగుతుండంగా.. ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. అదేంటంటే.. ఈ చిత్రంలో నందమూరి హీరో తారక రత్న మహేష్కు విలన్గా నటించనున్నాడని, ఆయన పాత్రలను పవర్ ఫుల్గా ఉండదని వార్తలు వచ్చాయి. ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తైనట్లు ప్రచారం జరిగింది.
అయితే శనివారం తారకరత్న చేసిన ట్వీట్ ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది. #SSMB28 అనే హ్యాష్ ట్యాగ్ పెట్టిన తారక రత్న.. ఈ చిత్రంలో అతని పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉన్న డాక్టర్ రోల్ అనుకునే విధంగా ఎమోజీలు జత చేశారు. దీంతో ఆయన ట్వీట్ కాస్త వైరల్గా మారింది. కాగా, `ఒకటో నెం. కుర్రాడు` సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ నందమూరి హీరో.. వరుస పెట్టి సినిమాలు చేశాడు. కానీ, సక్సెస్ ఫుల్ హీరోగా గుర్తింపు పొందలేకపోయాడు. అయితే త్రివక్రిమ్ సినిమాలో ఆయన మహేష్ కు విలన్గా నటిస్తే.. ఖచ్చితంగా ఆయన సెకెండ్ ఇన్నింగ్స్కు ప్లస్ అవుతుంది.
#SSMB28 💉👺
— Nandamuri TarakaRathna (@NTarakarathna) May 28, 2022
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!