Naresh Pavitra: నరేష్ పవిత్ర లోకేష్ రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.. ఇటీవల మళ్ళీ పెళ్లి అంటూ వీడియో షేర్ చేసి మేము మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నామని తెలిపారు.. అయితే మళ్లీ పెళ్లి అనేది ఓ సినిమా అని.. అందులో వాళ్ళిద్దరూ కలిసి నటిస్తున్నారు అని ఆ సినిమాకి పబ్లిసిటీ కోసం ఆ పోస్ట్ చేశారని సమాచారం.. ఇది ఇలా ఉంటే నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి తాజాగా యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో కృష్ణ చనిపోయిన రోజు రాత్రి అసలేం జరిగింది.. నరేష్ పవిత్ర ఎలా వ్యవహరించారన్నది ఆమె ఆధారాలతో సహా బయటపెట్టారు..
నరేష్ పవిత్ర మీడియా వాళ్ళు సెలబ్రిటీలు ఉన్నప్పుడు బాగా హడావుడి చేశారు వాళ్లు వెళ్లిపోయిన వెంటనే నరేష్ పవిత్ర కూడా అక్కడ నుంచి వెళ్లిపోయారని నేను ఒక్కదానినే ఆ రాత్రంతా పార్దివదేహం దగ్గరే ఉన్న వీడియో కూడా ఆమె బయట పెట్టారు ఈ వీడియోలో గంట గంటకు ఏం జరిగిందో ఆమె వివరించి చెప్పారు.
కృష్ణ మరణించిన రోజు ఆయన పార్థివదేహాన్ని వారి ఇంట్లోనే ఉంచారు. సూపర్ స్టార్ కృష్ణ లాంటి గొప్ప వ్యక్తి చనిపోతే అసలు ఆ రాత్రి ఆయన దగ్గర ఎవరూ లేరు. మహేష్ బాబుతో పాటు కృష్ణ కుటుంబం అంతా మరుసటి రోజు దహన సంస్కారాలు ఉండటంతో అంతా నిద్రకు ఉపక్రమించారు అక్కడ నేను నా కొడుకు మరి కొంత మంది మాత్రమే ఉన్నామని.. నరేష్ పవిత్ర లోకేష్ మీడియా ముందు చేసిందంతా ఫేక్ అని రమ్యా రఘుపతి ఆ రోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం అంత్యక్రియలు చేసే వరకు ప్రతి గంట గంటకు రిపోర్టు ఆధారాలతో ఒక వీడియో ను చూపించింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
రమ్య రఘుపతి కృష్ణ పార్ధివ దేహం దగ్గర 11 గంటల నుంచి ఉదయం అంత్యక్రియల వరకు ప్రతి గంటకు ఎవరు ఉన్నారో వివరించి చెప్పారు. రాత్రి 11 గంటలకు కేవలం రమ్య ఒక్కరు మాత్రమే అక్కడ ఉన్నారు. ఇక అలా 12 గంటలకు , రాత్రి 1 గంటకు రమ్య కొడుకు కృష్ణ కి అగరబత్తీలు వెలిగించడం ఆమె తన కొడుకుని అభినందించిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి.
2 గంటలకు, 3 గంటలకు కూడా అక్కడ ఎవ్వరూ లేకపోవడం. ఇక 4.15 గంటలకు రమ్య స్వయంగా కృష్ణ ఫోటో వద్ద దీపం వెలిగించారు. అప్పటకి కూడా అక్కడ ఎవ్వరూ లేకపోవడం గమనార్హం. ఇక ఉదయం 6.30 గంటలకు ఆయన పార్తీవదేహాన్ని పద్మాలయకు అంబులెన్స్లో షిఫ్ట్ చేశారని.. కనీసం షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఆంబులెన్స్లోకి కూడా నరేష్ రాలేదని.. తాను దగ్గరే ఉండి పంపించానని రమ్య ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ గారు నరేష్ కు సొంత తండ్రి కాకపోయినా.. నాకు, నరేష్కు పీటల మీద కూర్చొని పెళ్లి చేశారని.. కృష్ణ ఓ గొప్ప వ్యక్తని.. అలాంటి వ్యక్తికి చివర్లో దక్కాల్సిన గౌరవం ఇది కాదని రమ్య ఆవేదన వ్యక్తం చేశారు. నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరూ మీడియా ముందు హైలెట్ అవ్వడానికి మాత్రమే అక్కడ కనిపించారని అసలు విషయాన్ని రమ్య బయటపెట్టింది.