నందమూరి కల్యాణ్ హీరోగా నటిస్తోన్న చిత్రం `ఎంతమంచివాడవురా`. పెరుగుతున్న సాంకేతికత, తరుగుతున్న మానవ సంబంధాలను తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు సతీశ్ వేగేశ్న. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్ టైమ్లో ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ను యూనిట్ చిత్రీకరించింది. బాలకృష్ణ జైసింహాలో హీరోయిన్గా నటించిన నటాషా దోషి ఈ స్పెషల్ సాంగ్లో నర్తించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మెహరీన్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది.
previous post
next post