Mahesh-Nani: `సర్కారు వారి పాట`తో మరో హిట్ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన నెక్స్ట్ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది. గతంలో మహేష్తో త్రివిక్రమ్ తీసిన `అతడు, ఖలేజా` ప్రేక్షకులను బాగానే అలరించాయి.
దీంతో వీరి తాజా చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. `ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్తో ఈ మూవీ ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా ప్రారంభం కాగా.. రెగ్యులర్ షూటింగ్ మరి కొద్ది రోజుల్లోనే స్టార్ట్ కాబోతోంది. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటించబోతోంది. అలాగే శ్రీలీల సెకెండ్ మీరోయిన్గా కనిపించే అవకాశాలు ఉన్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ (చినబాబు) నిర్మించబోతున్నాడు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. అదేంటంటే.. ఈ మూవీలో న్యాచురల్ స్టార్ నాని ఓ పాత్రలో కనిపించబోతున్నారట. అది ఒక గెస్ట్ రోల్ అని.. అందులో నాని పర్ఫెక్ట్గా సెట్ అవుతాడని త్రివిక్రమ్ భావించారట.
ఈ నేపథ్యంలోనే మేకర్స్ నానీని సంప్రదించగా.. ఆయన కాదనలేక ఓకే చెప్పేశారని జోరుగా టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమై మహేష్, నానిలు ఒకే తెరపై కనిపిస్తే.. ఇరువురి హీరోల అభిమానులకు కన్నుల పండగే అవుతుంది. కాగా, ఈ మూవీ వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!