SSMB28: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు ప్రస్తుతం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “SSMB 28” వర్కింగ్ టైటిల్ తో తారక ఎక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ గత ఏడాదిలో కంప్లీట్ అయింది. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ గత ఏడాది ఫిబ్రవరి నెలలో పూజా కార్యక్రమాలు స్టార్ట్ కాగా అక్టోబర్ నెలలో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా ప్రారంభించిన నాటినుండి మహేష్ బాబుకి అనేక అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. గత ఏడాది జనవరి నెలలో అన్నయ్య రమేష్ బాబు తర్వాత సెప్టెంబర్ నెలలో తల్లి ఇందిరాదేవి ఇంకా నవంబర్ నెలలో తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో మహేష్ ఎంతగానో కృంగిపోయాడు.
తల్లి మరణించాక సినిమా మొదటి షెడ్యూల్ లో పాల్గొన్న మహేష్ సెకండ్ షెడ్యూల్ కి రెడీ అవుతున్న సమయంలో.. కృష్ణ కన్నుమూశారు. ఇంకా అదే సమయంలో సినిమా హీరోయిన్ పూజ హెగ్డే కాలికి కూడా గాయం కావడంతో ఆమె కూడా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. సంక్రాంతి పండుగ అయిన వెంటనే దాదాపు 60 రోజులపాటు ఏకధాటిగా షూటింగ్ జరగనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. పరిస్థితి ఇలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సరికొత్త అప్డేట్ ఇచ్చింది.
“SSMB 28” పాన్ ఇండియా ప్రాజెక్ట్ అని స్పష్టం చేసింది. “పెను తుఫాను తలోంచైనా చూడటానికి మేము రెడీ..మీరు? అనీ నెట్ ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. ఓటిటి హక్కులు దక్కించుకున్నామని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ థియేటర్ లలో విడుదలైన తరువాత రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేయడం జరిగింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో జరిగే ఎక్కుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. మే నెలలో లేదా ఆగస్టు నెలలో ఈ సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉంది.