డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైన “లైగర్” పరాజయం పాలు కావటం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా పడిన కష్టం తెరపై కనబడిన గాని దర్శకుడిగా పూరి మార్క్ తప్పింది. ఇటువంటి తరుణంలో ఈ సినిమా దర్శకులలో ఒకరైన ఛార్మీ “లైగర్” ఫెయిల్ కావడం పట్ల స్పందించడం జరిగింది. ప్రజలు ఇంట్లో కూర్చునే భారీ బడ్జెట్ సినిమాలు చూసే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. సినిమాలు వారిని ఆక్సైడ్ చేస్తేనే థియేటర్లకు వస్తూ ఉన్నారు. బింబీసార, సీత రామం, కార్తికేయ 2..బ్లాక్ బస్టర్ అయ్యాయి. బాలీవుడ్ లో పరిస్థితి దారుణంగా ఉంది.
మూడేళ్లు కష్టపడి ఎన్నో అడ్డంకులు దాటి “లైగర్” నీ సినిమా ధియేటర్లలో విడుదల చేయడం జరిగింది. కానీ సినిమా పరాజయం పాలు కావటం చాలా బాధ కలిగించింది అంటూ ఛార్మీ చెప్పుకొచ్చింది. “లైగర్” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో అంతా తానే ఛార్మీ వ్యవహరించడం జరిగింది. ముఖ్యంగా సినిమాలో మైక్ టైసన్ నటించడంలో ఒప్పించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెలియజేయడం జరిగింది. సినిమా టీం మొత్తాన్ని కూడా ఛార్మీ.. చాలా బాగా చూసుకున్నేది.
దాదాపు రెండు నెలల పాటు ప్రమోషన్ కార్యక్రమాలలో..ఛార్మీ.. నార్త్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు అన్ని పనులు చేసుకుంటూ.. రాణించగా సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెపించ లేకపోవడంతో ఛార్మీ ఎంతో నిరాశ చెందుతూ ఉంది. ఈ క్రమంలో.. చార్మి రియాక్షన్ కి సోషల్ మీడియాలో నేటిజన్ లు భారీగా కౌంటర్ లు ఇస్తున్నారు. నాకు తెలిసి పోరీ కాకుండా నువ్వే దర్శకత్వం చేశావు అంటూ కొంతమంది రియాక్ట్ కావడం జరిగింది. మరి కొంతమంది సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో సుమ ఇంటర్వ్యూలో నువ్వు అంత గట్టిగా నవ్వినప్పుడే సినిమా పోతుందని తెలిసిపోయిందని అంటున్నారు. నీ అతివాళ్లే “లైగర్” కి నష్టాలు వచ్చాయి. ఓటిటికి 200 కోట్ల ఆఫర్ వచ్చినప్పుడు ఒప్పుకుంటే ఇంత లాస్ వచ్చేది కాదు కదా మరి కొంతమంది గట్టిగానే చార్మి వ్యాఖ్యల పట్ల స్పందిస్తున్నారు.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!