Devi Nagavalli: యంగ్ హీరో విశ్వక్ సేన్, ప్రముఖ టీవీ ఛానెల్ యాంకర్ దేవి నాగవల్లి మధ్య జరిగిన రచ్చ ఎంత పెద్ద ఇష్యూ అయిందో ప్రత్యేకంగా వివరించి చెప్పాల్సిన పని లేదు. తన తాజా చిత్రమైన `అశోకవనంలో అర్జున కళ్యాణం` ప్రమోట్ చేయడం కోసం విశ్వక్ సేన్ రోడ్డు పక్కన ఓ ఫ్రాంక్ వీడియో చేశాడు. అయితే పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తారా అంటూ దేవీ నాగవల్లి.. విశ్వక్ సేన్ను స్టూడియోకి పిలిచి మరీ ప్రశ్నించింది.
ఈ క్రమంలోరు ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం, ఇద్దరూ నోరు జారడంతో.. పెద్ద వివాదంగా మారింది. అయితే ఈ ఇష్యూలో ఎక్కువ శాతం మంది విశ్వక్ సేన్కే మద్ధతు పలుకుతున్నారు. పైగా ఈ ఇష్యూ వల్ల `అశోకవనంలో అర్జున కళ్యాణం` అనుకున్న దాని కంటే ఎక్కువ బజ్నే క్రియేట్ అయింది. అంతేకాదు, నేడు ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో ఈ కొత్త సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. అదేంటంటే దేవి నాగవల్లిదో గొడవ పెట్టుకుంటే సినిమా హిట్ అట. ఇదెక్కడి సెంటిమెంట్ రా సామి అని అనుకుంటున్నారా..? అయితే దీని వెనక ఓ కారణం ఉంది. గతంలో అర్జున్ రెడ్డి సినిమా విడుదల సమయంలోనూ దేవి నాగవల్లి ఇలానే పెద్ద పెద్ద డిబేట్స్ పెట్టాశారు. రొమాంటిక్ సన్నివేశాల విషయంలో విజయ్ ను సైతం డైరెక్ట్గా ప్రశ్నలు వేసి హెడ్లైన్స్లో నిలిచింది. కట్ చేస్తే అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ అయింది.
మొన్నీ మధ్య వచ్చిన `డీజే టిల్లు` విషయంలో కూడా ఇదే జరిగింది. హీరో సిద్ధుని స్టూడియోకి పిలిచి ఇంటర్వ్యూ చేసిన దేవి నాగవల్లి.. నిజ జీవితంలో మీరు ఉమనైజరా? అంటూ ప్రశ్నించి వివాదం సృష్టించింది. అయితే ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇక తాజాగా అశోకవనంలో అర్జున కళ్యాణం విషయంలోనూ ఇదే జరుగుతుండటంతో.. హిట్ కావాలని ప్రయశ్నించే హీరోలు దేవి నాగవల్లితో గొడవ పెట్టుకుంటే సరిపోతుందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!