Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాహుబలి వంటి హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ క్రేజ్ విపరీతంగా విస్తరించింది. ఈ తరుణంలో ప్రభాస్ నటించిన సాహో, రాదేష్యమ్ రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడం .. ప్రభాస్ కెరియర్ మళ్లీ డేంజర్ జోన్ లో పడేటట్లు పరిణామాలు మారాయి. ఇక ఇదే సమయంలో ఒక్కో ప్రాజెక్టు కోసం ఏకంగా ఏడాదికి పైగా టైం తీసుకోవడంతోపాటు ఇటీవల పాండమిక్ కారణంగా రెండు సంవత్సరాల గ్యాప్ రావటంతో ప్రభాస్ ఒప్పుకున్న ప్రాజెక్టులను త్వరగా కంప్లీట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఇటీవల పెదనాన్న కృష్ణంరాజు మరణించడంతో ఎంతో నిరాశకు గురైన ప్రభాస్.. మళ్లీ షూటింగులు ఆపేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా కృష్టం రాజు చనిపోయిన 11 రోజుల తర్వాత మళ్లీ యధావిధిగా కొత్త సినిమాల షూటింగ్ లలో జాయిన్ అవుతున్నాడు. ఇదిలా ఉంటే టాలీవుడ్ దర్శకుడు మారుతి తో ప్రభాస్ ప్రాజెక్టు ఓకే చేయటం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి దీపావళి పండుగకు ముందు ఒక షెడ్యూల్ కంప్లీట్ చేయడానికి మారుతి లేటెస్ట్ గా ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. చిన్నపాటి షెడ్యూల్ ప్రిపేర్ చేసినట్లు.. ప్రభాస్ జాయిన్ కానున్నట్లు టాక్.
ఈ సినిమాకి “డీలక్స్ రాజా” అనే టైటిల్ పెట్టినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ పాత్రలో ఇంకా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ లు హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అతి తక్కువ టైం లోనే ఈ సినిమా కంప్లీట్ కానున్నట్లు సమాచారం.