SSMB 28: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. SSMB 28 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్. దసరా పండుగకు ముందు మొదటి షెడ్యూల్ కంప్లీట్ అయింది. ఈ షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సీన్స్ చిత్రీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. నవంబర్ నెలలో సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో పూజ హెగ్డే జాయిన్ కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ నోరా ఫతేహితో స్టెప్ లు వేయించడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.
త్వరలోనే ఈ వార్త అధికారికంగా సినిమా యూనిట్ ప్రకటించనున్నట్లు సమాచారం. నోరా ఫతేహితో మహేష్ స్పెషల్ సాంగ్ లో స్టెప్స్ వేయనున్నట్లు టాక్. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదల కానుంది. నవంబర్ నుండి ఏకధాటిగా షూటింగ్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసే దిశగా సినిమా యూనిట్ రెడీ అయినట్లు సమాచారం. వాస్తవానికి ఈ సినిమా “సర్కారు వారి పాట” విడుదలైన తరువాత జూన్ నెలలో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ వాయిదాలు పడుతూ వచ్చింది. సెప్టెంబర్ నెల చివరిలో మొదటి షెడ్యూల్ ప్రారంభమై దసరా పండుగకు ముందు కంప్లీట్ అయింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ నుండి సినిమా ఏకధాటిగా షూటింగ్ జరుపుకొని మార్చి రెండో వారంకి కంప్లీట్ చేసే దిశగా ప్లాన్ చేసినట్లు సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో మహేష్ అతడు, ఖలేజా నటించడం తెలిసిందే. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో వస్తున్న ఈ మూడు సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.