Nidhhi Agerwal: నిధి అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `మున్నా మైకెల్` అనే హిందీ మూవీతో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన `సవ్యసాచి` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా పెద్ద విజయం సాధించకపోయినా.. నిధి నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఆ తర్వాత అఖిల్తో `మిస్టర్ మజ్ను` చేసిన నిధి.. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన `ఇస్మార్ట్ శంకర్` మూవీలో రామ్కు జోడీగా నటించి ఫస్ట్ హిట్ను ఖాతాలో వేసుకుంది. ఈ మూవీ ఇచ్చిన సక్సెస్తో నిధి వరుస సినిమాలతో దూసుకుపోవడం ఖాయమని అందరూ భావించారు. కానీ, నిధి మాత్రం నత్త నడక మాదిరిగా సినిమాలు చేస్తోంది.
దీంతో ఆమెకు ఆఫర్లు రావడం లేదని ప్రచారం కూడా మొదలైంది. అయితే ఈ విషయంపై తాజాగా నిధి స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. `వరుస అవకాశాలు వస్తున్నాయి. దూకుడుగా వచ్చిన సినిమానల్లా ఒప్పేసుకుంటూ పోతే.. ఎంత త్వరగా క్రేజ్ వస్తుందో అంతే త్వరగా పోతుంది. అందుకే నిదానంగా ఒక్కో సినిమా చేసుకుంటూ వెళదామని అనుకున్నాను.
అలా అయితేనే సినీ ఇండస్ట్రీలో నిలబడతామని నా నమ్మకం. అలాగే ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే సహనం ఉండాలి. ప్రస్తుతం మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నా` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడీమె కామెంట్స్ నెట్టింట వైరల్గా మారింది. కాగా, నిధి సినిమాల విషయానికి వస్తే.. ఇటీవల `హీరో`తో ప్రేక్షకులను పలకరించిన ఈ అందాల భామ.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు జోడీగా క్రిష్ దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` మూవీలో నటిస్తోంది.