Nidhi Agarwal: నాగచైతన్య హీరోగా తెరకెక్కిన `సవ్యసాచి` సినిమాతో హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన నిధి అగర్వాల్.. `ఇస్మార్ట్ శంకర్` మూవీతో తొలి హిట్ను ఖాతాలో వేసుకుంది. రామ్ హీరోగా డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందించిన ఈ చిత్రం 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దీంతో నిధికి వరుస అవకాశాలు తలుపు తట్టాయి. కానీ, సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయింది.
ఇక తాజాగా నిధి అగర్వాల్ `హీరో` సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా డబ్యూ సినిమా ఇది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యారన్పై పద్మావతి గల్లా నిర్మించారు.
సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ను సొంతం చేసింది. ఇకపోతే ఈ సినిమాకు నిధి తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఇంతకుముందు ఒక్కో సినిమాకు ఎనబై లక్షల వరకు ఛార్జ్ చేసిన నిధి.. హీరో సినిమాకు మాత్రం ఏకంగా కోటిన్నర రూపాయిలను తీసుకుందని టాక్.
నిజానికి `హీరో` చాలా చిన్న చిత్రం. పైగా యంగ్ హీరో డబ్యూ చిత్రం. ఇటువంటి సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత నటించినా.. ఆమెకు కోటిన్నర ఇవ్వడం కష్టమే. కానీ, నిధి అగర్వాల్ మాత్రం అంత భారీ అమౌంట్ తీసుకోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.