ప్రస్తుతం బయోపిక్స్ ట్రెండ్స్ నడుస్తుంది.. టాలీవుడ్ విషయానికి వస్తే సావిత్రి, ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత చంద్రబాబు, వై.ఎస్.ఆర్ కెరీర్లో పాదయాత్రకు సంబంధించిన బయోపిక్ ఇలా చాలా బయోపిక్స్ విడుదలయ్యాయి. ఇప్పుడు వీటికి భిన్నంగా ఓ దొంగ బయోపిక్ రూపొందనుంది. 1970 దశకంలో స్టూవర్టుపురం ప్రాంతంలో పేరు మోసిన దొంగ నాగేశ్వరరావు ఉండేవాడు. ఆయన రాబిన్హుడ్గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఆయన జీవితాన్ని ఇప్పుడు సినిమా రూపంలో చేయబోతున్నారు. టైగర్ పేరుతో తెరకెక్కబోయే ఈ బయోపిక్లో టైటిల్ పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం శ్రీనివాస్ బాడీ బిల్డింగ్ కూడా చేస్తున్నాడు. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. అందులో ఓ హీరోయిన్గా ఆర్.ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్పుత్ను తీసుకున్నారు. కాగా మరో హీరోయిన్గా నిధి అగర్వాల్ను సెలక్ట్ చేసుకున్నారని సినీ వర్గాల సమాచారం. సవ్యసాచి, మిస్టర్ మజ్ను చిత్రాల తర్వాత ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నిధి అగర్వాల్ నటిస్తుంది. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. దొంగాట ఫేమ్ వంశీ కృష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు.
previous post
next post
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!