మరికొన్ని గంటల్లో నిహారిక జొన్నలగడ్డ చైతన్య వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు బుధవారం రాత్రి 7 గంటల 15 నిమిషాలకు వీరి వివాహం జరగనుంది. ఈ వివాహ వేడుక కోసం బంధువులు అందరూ ఇప్పటికే ఉదయ్పూర్ చేరుకున్నారు. చిరంజీవి సురేఖ దంపతులతో పాటు రామ్ చరణ్ ఉపాసన అలాగే అల్లు కుటుంబం కూడా ఉదయ్పూర్కు చేరుకుంది. అల్లు అర్జున్ తన కుటుంబంతో ప్రత్యేక విమానంలో అక్కడికి చేరుకున్నారు. అలాగే మరి కొందరు సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరు కానున్నారు. అందరూ అక్కడి వెళ్ళినప్పటికి అభిమానుల కళ్ళు మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైనే ఉన్నాయి. ఈ వివాహ వేడుకకు హాజరు అవుతాడా! లేదా! అనే అనుమానాలు నెలకొన్న వేళ తాజాగా బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో ఉదయపూర్ కి వెళ్లారు పవన్ కళ్యాణ్. దీంతో మెగా ఫ్యామిలీ అంతా ఒకే వేదికపై కనువిందు చేయనుంది.
ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు పరామర్శిస్తున్నారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. ఇన్నాళ్లు మెగా కుటుంబంతో అంటిముట్టనట్టుగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ నిహారిక పెళ్లి సందర్భంగా మళ్లీ ఆ కుటుంబం కలవనున్నారు. మళ్ళీ మెగా కుటుంబం ఒకటవుతున్నారని అభిమానులు ఆనందపడుతున్నారు. మెగా కుటుంబానికి సంబంధించిన వేడుకలలో కనిపించని పవన్ కళ్యాణ్ నిహారిక పెళ్లి కోసం ఉదయపూర్కి వెళ్లారు. అయితే తన పెళ్ళికి బాబాయిని ఎలాగైనా రప్పించాలని భావించిన నిహారిక పవన్ కళ్యాణ్ స్పెషల్గా ఫోన్ చేశారట! అతని దగ్గర నుంచి ప్రామిస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. చివరకి పవన్ కళ్యాణ్ కూడా మెగా కుటుంబంలో చేరడంతో ఆ ఫ్యామిలీలో ఆనందం రెట్టింపు అయింది.