నితిన్, రష్మిక మందన్న, వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న కొత్త చిత్రం `భీష్మ`. ఈ చిత్రం బుధవారం హైదరాబాద్లోని సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. డిసెంబర్ నెలలో చిత్రం విడుదలయ్యేలా సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత సూర్యదేవర నాగ వంశీ తెలిపారు.
“ఈ ప్రాజెక్ట్ గురించి నేను చాలా ఆనందంగా ఉన్నాను. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చినందుకు టీమ్ అంతా చాలా హ్యాపీ గా ఉన్నారు. ప్రతి అబ్బాయి నితిన్గారి క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యేవిధంగా డిజైన్ చేశాం. అలాగే ప్రతి యువతి కూడా రష్మిక క్యారెక్టర్కి కనెక్ట్ అవుతుంది. ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. అలాగే చాలా ఫన్ ఎలిమెంట్స్తో సాగుతుంది“ అని తెలిపారు దర్శకుడు వెంకీ కుడుముల.
నితిన్,రష్మిక మందన్న, నరేష్, సంపత్, రఘుబాబు, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, కల్యాణి నటరాజన్, రాజశ్రీ నాయర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ : మహతి స్వర సాగర్ , సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్ , ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్, ఎడిటర్ : నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకట రత్నం(వెంకట్ ), సమర్పణ : పి.డి .వి. ప్రసాద్ , ప్రొడ్యూసర్: సూర్యదేవర నాగ వంశీ , కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : వెంకీ కుడుముల.