యూత్స్టార్ నితిన్ ఓ కొత్త ప్రయోగానికి తెర తీశాడు. ఇప్పటి వరకు మన తెలుగు సినిమాల్లో రెండు భాగాలనే చిత్రీకరించారు. తొలిసారి మూడు పార్టులతో ఓ సినిమా తెరకెక్కనుంది. అందులోనితిన్ హీరోగా నటించబోతున్నాడు. రైటర్ నుండి డైరెక్టర్గా మారిన కృష్ణ చైతన్య తెరకెక్కించబోయే ఈ సినిమాకు పవర్ పెట్ అనే టైటిల్ను నిర్ణయించారట. ఇప్పటి వరకు ఓ సినిమాను మూడు భాగాల్లో కలిపి తెరకెక్కించలేదు. తొలిసారి నితిన్ నటిస్తున్నాడు. అది కూడా తన హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్లో చేయబోతున్నాడట. ఈ ఏడాదికి తన కమిట్మెంట్స్ పూర్తి చేసి తర్వాత ఈ ట్రైలోగిలో నితిన్ నటిస్తాడట. ప్రస్తుతం నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో `భీష్మ` సినిమాతో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమాను చేయబోతున్నాడు.
previous post
next post