టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లిస్టులో ఉన్న హీరో నితిన్ కు వివాహం కాబోతోంది. తన స్నేహితురాలు షాలినిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు. ఇందుకు సంబంధించి నిశ్చితార్ధ వేడుకలు కూడా జరిగాయి. పరిమిత సంఖ్యలో ఇరు కుటుంబాల బంధువుల మధ్యే ఈ వేడుక జరిగింది. నితిన్ – షాలిని ఇద్దరూ ఉంగరాలు మర్చుకున్న ఫొటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. ఈ వేడుకలో ఇద్దరి జంట చూడముచ్చటగా ఉన్నారంటూ అభిమానులు, నెటిజన్లు మెచ్చుకుంటూ మెసేజెస్ చేశారు. ముఖ్యంగా షాలిని లుక్ మరింత హైలైట్ అయింది.
కెమెరాకు షాలిని చూడ చక్కగా కనిపించింది. ప్రతి ఫొటోలో కూడా షాలిని చిరునవ్వే హైలైట్ అయింది. నితిన్ కు సరిజోడుగా అందంగా ఉందని కామెంట్లు వచ్చాయి. దీంతో వీరిద్దరి జంట టాలీవుడ్ హాట్ టాపిక్ అయ్యాయి. వీరి పెళ్లి వేడుక ఈ నెల 26న ప్రసిద్ధ ఫలక్ నుమా ప్యాలెస్ లో రాత్రి 8:30కి జరుగనుంది. కరోనా వైరస్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే అతిధులను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పెళ్లికి హాజరుకానున్నట్టు తెలుస్తోంది. నాగర్ కర్నూల్ కు చెందిన షాలిని డాక్టర్. వీరిద్దరిదీ 8ఏళ్ల స్నేహం.. 5ఏళ్ల ప్రేమ అని తెలుస్తోంది. పెద్దలను ఒప్పించి వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు.