Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయంగా మరో పక్క సినిమాల పరంగా మంచి స్పీడ్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుండి రాజకీయాల్లో బిజీగా ఉండటంతో దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా.. “వకీల్ సాబ్” త్వరలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాతలు. మరోపక్క సినిమాకి సంబంధించి ట్రైలర్ 29వ తారీకు రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో పవన్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.
ఈ సినిమా ఏప్రిల్ 9న భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో …మెగా అభిమానులు మంచి హడావిడి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే మూడు సంవత్సరాలు అభిమానుల దాహం తీర్చే రీతిలో వరుసపెట్టి సినిమాలు చేస్తున్న పవన్ ..రానాతో మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ ఛాన్స్ యంగ్ హీరోయిన్ నిత్యామీనన్ అందుకున్నట్లు సరికొత్త టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది.
ఆల్రెడీ రానా కి జోడీగా ఐశ్వర్య రాజేష్ కన్ఫర్మ్ అయినట్లు వార్తలు ఇటీవల వస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో పవన్ పక్కన నిత్యా మీనన్ ఓకే అయినట్లు సరికొత్త వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వస్తున్న నేపథ్యంలో ఈ వార్త విని పవన్ అభిమానులు ..చాలా ఫ్రెష్ గా ఉంటుంది ఈ జోడి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే సెప్టెంబర్ మాసంలో సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న టాక్.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!