హీరోయిన్ పెర్ఫామెన్స్ పాత్రలకు నిత్యామీనన్ అధిక ప్రాధాన్యం ఇస్తుంటుంది. అంతే కాకుండా ఆమె లక్కీ హీరోయిన్ కూడా. ఎందుకంటే పదేళ్ల పాటు హిట్స్ లేని నితిన్తో నిత్యామీనన్ రెండు సినిమాలు చేసింది. ఆ చిత్రాలే ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే. ఈ సినిమాలు పెద్ద హిట్స్ కావడంతో నితిన్ రూట్ సక్సెస్ ట్రాక్లోకి ఎక్కింది. ఇప్పుడు మరో యువ హీరో రాజ్తరుణ్ కూడా సక్సెస్ లేకుండా ఇబ్బందులు పడుతున్నాడు.
సమాచారం ప్రకారం రాజ్తరుణ్ , నిత్యామీనన్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. `గుండెజారి గల్లంతయ్యిందే` ఫేమ్ విజయ్ కుమార్ కొండ దర్శకత్వంలో రాధామోహన్ ఓ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ చిత్రంలో రాజ్తరుణ్ హీరో. అయితే హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలని విజయ్ కుమార్ కొండ చాలా ఆలోచించాడట. చివరకు తన దర్శకత్వంలో నటించిన నిత్యామీనన్నే తీసుకోవాలని భావించి ఆమెను కలిసి కథను నెరేట్ చేశాడట. కథ బాగా నచ్చడంతో నిత్యా కూడా ఆసక్తి కనపరుస్తుందట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక సమాచారం వెలువడనుంది.