విలక్షణ నటిగా నిత్యామీనన్కు ఉన్న గుర్తింపే వేరు. అందుకు కారణం నిత్యా స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో ఓ పద్ధతిని పాటించడమే. అయితే ఈ మధ్య నిత్యా మీనన్ ప్రవర్తన తమకు బాధ కలిగించిందని కొందరు నిర్మాతలు ప్రచారం చేస్తున్నారు. అందుకు కారణం వారు నిత్యామీనన్ పర్మిషన్ లేకుండా ఆమెను కలవడానికి రావడమేనట. కొందరు నిర్మాతలు నిత్యామీనన్ను బ్యాన్ చేయాలని కూడా అనుకున్నారట. దీనిపై స్పందించిన నిత్యా “మా అమ్మకు క్యాన్సర్. మూడో దశలో ఉంది. షూటింగ్ సమయంలో ఆమె గుర్తొచ్చినప్పుడల్లా క్యారీ వ్యాన్లోకి వెళ్లి ఏడుస్తుంటా. నాకు మైగ్రేన్ కూడా ఉంది. నాతో నిర్మాతలు మాట్లాడటానికి వచ్చినప్పుడు నేను వారిని కలిసే స్థితిలో లేను. దీంతో నాకు పొగరు అని అంటున్నారు. అయితే ఇలాంటి కామెంట్స్ను నేను పట్టించుకోను. పనిపైనే ఫోకస్ పెడతాను“ అని తెలిపారు. ప్రస్తుతం నిత్యామీనన్ జయలలిత బయోపిక్ `ది ఐరన్ లేడి`తో పాటు కొలంబి, సైకి, మిషన్ మంగళ్ తదితర సినిమాల్లో నిత్యా నటించాల్సి ఉంది.
ReplyForward |