Nithiin: హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న టాలీవుడ్ హీరోల్లో నితిన్ ఒకడు. ప్రస్తుతం ఈయన `మాచర్ల నియోజకవర్గం` అనే మూవీ చేస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కృతిశెట్టి, కేథరిన్ హీరోయిన్స్గా నటిస్తున్నారు.
శ్రేష్ట్ మూవీస్,ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై ఎన్. సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ.. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ను కంప్లీట్ చేసుకుంది. తాజాగా ఈ సినిమాలోని ఓ మూడు పాటలను చిత్రీకరించేందుకు మేకర్స్ ఇటలీ వెళ్లారట. అయితే పాటకు, పాటకు కొంత గ్యాప్ ఉండటంతో.. నితిన్ నయా ప్లాన్ వేశాడట.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అసలింతకీ ఆయన ఇటలీలో చేసిన పనేంటో తెలిస్తే.. నితిన్ మామూలోడు కాదని అనకుండా ఉండలేదు. మాచర్ల నియోజకవర్గం పూర్తి కాకముందే నితిన్.. వక్కంతం వంశీ దర్వకత్వంలో ఈ మూవీని ప్రారంభించాడు. ఇది నితిన్ కెరీర్లో 32వ సినిమాగా రాబోంది. ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఇటలీలో మాచర్ల నియోజకవర్గం షూటింగ్ నుంచి కాస్త గ్యాప్ దొరకడంతో.. ఆ టైమ్ను యూస్ చేసుకుని నెక్ట్స్ సినిమా కోసం షూటింగ్ చేసుకోవాలని ప్లాన్ చేశాడట నితిన్.
ఇందులో భాగంగానే డైరెక్టర్ వక్కంతం వంశీ, హీరోయిన్ శ్రీలీలతో సహా కెమెరామెన్, కొరియోగ్రాఫర్ ను కూడా ఇటలీకి రప్పించారట. ప్రస్తుతం నితిన్ – శ్రీలీలపై ఒకటి రెండు పాటలను ఇటలీలోనే చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకు ఎలాగో నితినే ప్రొడ్యూసర్ కాబట్టి.. టైమ్ తో పాటు ఖర్చు కూడా కలిసోస్తుందని అలా ఆయన ప్లాన్ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.