బాలీవుడ్ లో గత సంవత్సరం అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ‘మిషన్ మంగళ్’ లో ఒక ముఖ్య పాత్ర పోషించి హిందీ జనాలను బాగా ఆకట్టుకుంది నిత్యా మీనన్. ఈ సినిమాతో బాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకుంది. దాంతో బాలీవుడ్ లో ఏకంగా స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ తో నటించే ఛాన్స్ అందుకుంది. అయితే అది వెబ్ సిరీస్. వాస్తవంగా నిత్యా మీనన్ కి ఎప్పుడో బాలీవుడ్ సినిమాలలో అవకాశాలు వచ్చినప్పటికి పాత్ర నచ్చక సున్నితంగా తిరస్కరించింది. కాని ‘మిషన్ మంగళ్’ పాత్ర తనకి బాగా నచ్చడం తో ఓకే చెప్పింది.
ఇప్పుడు తాజాగా నటించిన నిత్యా మీనన్ వెబ్ సిరీస్ నుండి ఫస్ట్ లుక్ రిలీజై అందరికీ ఆసక్తిని రేపుతోంది. ఈ వెబ్ సిరీస్ గురించి ఎలాంటి సమాచారం లేకుండా సడన్ గా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి చిత్ర బృందం షాకిచ్చింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ మీడియా నుండి అందుతున్న సమాచారం ప్రకారం నిత్యా అభిషేక్ బచ్చన్ ని డామినేట్ చేస్తుందని తెలుస్తుంది. నిత్యా పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకసారి పాత్రలోకి లీనమైతే ఎంతగా ఆకట్టుకుంటుందో తెలుగు తమిళంలో ఇప్పటి వరకు తను నటించిన సినిమాలు చూస్తే అర్థమవుతుంది.
ఇక నిత్యా మీనన్ ప్రస్తుతం ‘బ్రీత్ ఇన్ టు ద షాడోస్’ పేరుతో వస్తున్న వెబ్ సిరీస్ నుండి ఫస్ట్ లుక్ వచ్చి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ వెబ్ సిరీస్ జులై 10న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. బ్రీత్ వెబ్ సిరీస్ పార్ట్ వన్ లో మాధవన్ లీడ్ రోల్ లో నటించాడు. ఇప్పుడు ‘బ్రీత్ వెబ్ సిరీస్’కు సీక్వెల్ లో అభిషేక్ బచ్చన్ నటించడంతో విశేషం.