అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. లవ్ స్టోరీ అన్న టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా దాదాపు ఈ సినిమా కంప్లీట్ కావచ్చిందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్, లిరికల్ సాంగ్ అలాగే టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ .. అతర్వాత వచ్చిన టీజర్ తో పక్కా రొమాంటిక్ సినిమా అని అర్థమైంది. మొదటిసారి నాగ చైతన్య ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లడతాడని అందుకు భాష మీద పట్టు సంపాదించడానికి బాగా కష్టపడ్డాడని అన్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ క్రియోట్ అయింది.
ఈ సినిమా తర్వాత నాగ చైతన్య విక్రం కె కుమార్ తో ఒక సినిమా చేయబోతున్నాడని తాజా సమాచారం. మనం తర్వాత నాగ చైతన్య విక్రం కుమార్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా కూడా రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. లాక్ డౌన్ తర్వాత ఈ సినిమాని లాంచ్ చేసి సెట్స్ మీదకి వెళతారట. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. మొత్తానికి సేఫ్ జోన్ లో సినిమా సెలెక్ట్ చేసుకున్నాడు నాగ చైతన్య.