Anasuya : బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న అనసూయ ఒకవైపు బుల్లితెరపై తన హవా కొనసాగిస్తూనే, మరోవైపు వెండితెరపై తన నటనా నైపుణ్యాన్ని చాటుకుంటోంది.ఈ క్రమంలోనే వెండితెరపై పలు కీలకమైన పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న అనసూయకి ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా అందరినీ ఆకట్టుకున్న అనసూయ ప్రస్తుతం వరుస ఆఫర్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూతనకు సంబంధించిన విషయాలను గురించి ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటారు. తాజాగా అనసూయ సోషల్ మీడియా ద్వారా మరొక ఆసక్తికరమైన విషయం గురించి అభిమానులతో పంచుకున్నారు.
ప్రస్తుతం అనసూయ “థాంక్యూ బ్రదర్”అనే సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలయి మంచి ఆదరణ పొందింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే రవితేజ కిలాడి, రంగమార్తాండ, పుష్ప వంటి చిత్రాలలో అనసూయ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఇవేకాకుండా అనసూయ కార్తికేయ, లావణ్య త్రిపాటి జంటగా తెరకెక్కుతున్న చిత్రం “చావు కబురు చల్లగా”అనే సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా సందడి చేయనున్నారు.
ఇకపై ఐటమ్ సాంగ్స్ కు దూరం:
ప్రస్తుతం చావు కబురు చల్లగా ఈ సినిమాలోనే కాకుండా మరి కొన్ని సినిమాలలో కూడా అనసూయ ఐటమ్ సాంగ్స్ చేస్తుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై స్పందించిన అనసూయ తను ఏ సినిమాలోనూ స్పెషల్ సాంగ్స్ చేయలేదని… కేవలం చావు కబురు చల్లగా సినిమాలో స్పెషల్ సాంగ్ కొరియోగ్రాఫర్ తన ఫ్రెండ్ జానీ మాస్టర్ కావడంతో ఈ సినిమాలో మాత్రమే స్పెషల్ సాంగ్ లో నటించడానికి ఒప్పుకున్నానని తెలియజేశారు. ఇకపై ఐటమ్ సాంగ్స్ కి దూరమని, వెండితెరపై అద్భుతమైన పాత్రలో నటించాలనేది తన కోరిక అంటూ అనసూయ తెలియజేశారు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఈ యాంకర్ కు తమిళ, మలయాళం ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వచ్చినట్లు తెలుస్తోంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!