గత రెండు నెలలుగా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్స్ ని తిరిగి మొదలు పెట్టుకోవచ్చని ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. కాకపోతే కరోనా నిబంధనలతో గైడ్ లైన్స్ రూపొందించి మాత్రమే అనుమతిచ్చారు. ఈ నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల్లో జూన్ 15 నుండి సీరియల్స్, సినిమా షూటింగ్స్ మొదలవబోతున్నాయి. ఇక తెలంగాణా ప్రభుత్వం సేఫ్టీ మెజర్స్ దృష్టిలో పెట్టుకొని షూటింగ్స్ కోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.
కాని ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయిన సినిమాలు మాత్రమే మొదలు పెట్టుకోవాలని నిబంధన పెట్టారు. దీంతో ఇప్పటికే ఒకటి రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న సినిమాలు.. స్టార్టింగ్ స్టేజిలో ఉన్న చిన్న సినిమాలకు.. ఇంకా స్టార్ట్ అవని పెద్ద సినిమాలకు బ్రేక్ పడిందని అంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ ల ‘ఆచార్య’.. దర్శకధీరుడు రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’.. ప్రభాస్ – రాధాకృష్ణ ల సినిమా.. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’.. అక్కినేని అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్’.. సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’.. అక్కినేని నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ లాంటి సినిమాలు ఇప్పటికే చాలా భాగం షూటింగ్స్ కంప్లీట్ చేసుకుని ఉన్నాయి. ఈ సినిమాలలో కొన్ని దాదాపు 90 శాతం షూటింగ్ కంప్లీట్ కాగా కొన్ని 60-70 శాతం షూటింగ్ జరిగాయి.
అయితే ఈ సినిమాలకే తెలుగు రాష్ట్రాల నుండి షూటింగ్స్ అనుమతి లభించినట్టు.. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘పుష్ప’.. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’.. బాలయ్య – బోయపాటి శ్రీను సినిమా.. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాలు ఇప్పట్లో షూటింగ్స్ జరుపుకోవడం కష్టమే అని అంటున్నారు. ఇది ఒకరకంగా ట్విస్టే అని చెప్పాలి.