Director shankar : కోలీవుడ్ దర్శక ధీరుడు శంకర్ ఎన్నో ప్రతిష్టాత్మకమైన చిత్రాలను తెరకెక్కించి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాడు. శంకర్ సినిమా అనగానే ఆ సినిమా పక్కా హిట్ అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించే సినిమాలలో దర్శకుడు శంకర్ కు ఎవరు సాటిరారు. ఈ నేపథ్యంలోనే శంకర్ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ఐశ్వర్యారాయ్ జంటగా 2010వ సంవత్సరంలో తెరకెక్కిన చిత్రం రోబో. రోబో సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను కురిపించింది అందరికీ తెలిసినదే. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.
ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు శంకర్ కు మాత్రం కష్టాలు తప్పలేదు. కాపీరైట్ విషయంలో శంకర్ కు ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు 2 నాన్బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. ఈ కేసులో శంకర్ గతంలోనే కోర్టులో హాజరు కావాల్సి ఉండగా వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా కోర్టుకు హాజరు కాలేదు. ఈ కేసుకు సంబంధించి విచారణను 2021 ఫిబ్రవరి 19న కు వాయిదా వేశారు.
అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 19న శంకర్ తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని సూచించింది. అయితే డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని తాను రాసిన జిగుబా కథను కాపీ చేసి రోబో చిత్రాన్ని తీశాడని ఆరోపిస్తూ తమిళ రచయిత అరుర్ తమిళ్నాదన్ కోర్టును ఆశ్రయించాడు. జిగుబా స్టోరీ మొదటగా ఒక మ్యాగజైన్లో ప్రచురితమైనది. అయితే ఈ కథే 2007 సంవత్సరంలో ఢిక్ ఢిక్ దీపికా దీపికా నవల పున:ప్రచురితం కూడా అయిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శంకర్ 1957 కాఫీ రైట్ ఉల్లంగిచాడని, తన రూపొందించుకున్న జిగుబా కథను రోబోగా తెరకెక్కించి చిత్ర బృందం మొత్తం లాభాలను తీసుకున్నారని ఈ సందర్భంగా అరుర్ తమిళ్నాదన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సినిమాల వల్ల చిత్రబృందం మొత్తం మంచి గుర్తింపును తెచ్చుకున్న అప్పటికీ డైరెక్టర్ శంకర్ కి మాత్రం కోర్టు వారెంట్లు తప్పడం లేదని తెలుస్తోంది. అయితే ఈ నెల 19న కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఈ విషయంపై డైరెక్టర్ స్పందించకపోవడం గమనార్హం.