నందమూరి తారక రామారావు, బసవతారకమ్మ జీవితాల ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘ఎన్టీఆర్’. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ పార్ట్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. బాలకృష్ణ-క్రిష్ కలయికలో వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఊహించిన స్థాయిలో లేకపోవడం, కథనం నెమ్మదిగా సాగడం కారణంగా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాపై నెగటివ్ కామెంట్స్ రావడానికి ముఖ్య కారణాలయ్యాయి.
ఎంత పోటీ ఉన్నా కూడా భారీగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా, మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 30కోట్లు కలెక్ట్ చేసి ట్రేడ్ వర్గాలని కూడా ఆశ్చర్యపరిచింది. నిజానికి ఈ లెక్క అనుకున్న దానికన్నా తక్కువే అయినా కూడా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఎన్టీఆర్ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి, గీత గోవిందం లాంటి హిట్ సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ ని బీట్ చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 10 కోట్ల షేర్ రాబట్టిన కథానాయకుడు సినిమాకి అసలు కష్టాలు ఇప్పుడే మొదలయ్యాయి. వినయ విధేయ రామ సినిమా రూపంలో బాలయ్య సాధిస్తున్న కలెక్షన్స్ కి పెద్ద అడ్డంకి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాపై ఉన్న అంచనాలు చూస్తుంటే మొదటి మూడు రోజులు వినయ విధేయ రామ జోష్ తగ్గేలా లేదు, ఈ జోష్ కి కాస్త పాజిటివ్ టాక్ తోడైనా కూడా ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్ కి చాలా నష్టం జరుగుతుంది. ఒకవేళ వినయ విధేయ రామ అస్సలు బాగోలేక, నెగటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం ఎన్టీఆర్ మళ్లీ బాక్సాఫీస్ దగ్గర పుంజుకునే అవకాశం ఉంది. ఇంకా పూర్తిగా పండగ మొదలు కాలేదు కాబట్టి, ఇప్పుడు కథానాయకుడు కలెక్షన్స్ కొంచెం నెమ్మదించినా కూడా ఫెస్టివల్ డేస్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించాలి లేదంటే ఎన్టీఆర్ సినిమా భారీ నష్టాలు ఫేస్ చేసే ప్రమాదం ఉంది.