NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం మంచి జోరుమీదున్నాడు. వరుస విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్న ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో “ఆర్ఆర్ఆర్” చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని మాస్ ఫాలోయింగ్ ఎన్టీఆర్ కి ఉంది అని చాలామంది మేకర్స్ అంటూ ఉంటారు. దీంతో కేజీఎఫ్ లాంటి మాస్ సినిమా చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ .. తో ఎన్టీఆర్ సినిమా పడితే ఆ బొమ్మ వేరే గా ఉంటుందని ఎప్పటినుండో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డిస్కషన్లు చేసుకుంటూ ఉన్నారు.
“కేజీఎఫ్” సినిమా కన్నడం లో తీసిన గాని .. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ని షేక్ చేసి పడేసింది. దీంతో ఈ సినిమా విజయంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు చాలా పాపులర్ అయ్యింది. కే జి ఎఫ్ లో యాష్ ని చూపించిన విధానం.. సినిమా ఆడియన్స్ రోమాలు నిక్క పొడుచుకునేలా చేశాయి. ఇంత మంచి పాపులారిటీ సంపాదించుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో “సలార్” అనే సినిమా చాన్సు దక్కించుకున్నాడు.
అయితే ఈ సినిమా తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ప్రశాంత్ నీల్ రెడీ అయినట్లు, ఇప్పటికే స్టోరీ కూడా ఓకే చేసినట్లు .. త్వరలోనే అధికారికంగా వార్త వచ్చే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ గా సరికొత్త టాక్ వినిపిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో.. ఎన్టీఆర్ చేయబోయే సినిమా తర్వాత ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. బీభత్సమైన మాస్ సబ్జెక్ట్ తో ఎన్టీఆర్ తో కేజిఎఫ్ డైరెక్టర్ సినిమా చేస్తున్నట్లు.. లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీ లో వైరల్ అవుతుంది.